హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులుకు అరుదైన గౌర వం లభించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆహార, వ్యవసాయ సంస్థ (డబ్ల్యూఎఫ్ఏవో) ఏర్పాటుచేసిన శాస్త్ర, సాంకేతిక సలహా మండలికి ఆయన సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ అవకాశం భారత్లో కేశవులుకు మాత్రమే దక్కడం గమనార్హం. భారత ధాన్యాగారంగా పేరొందిన తెలంగాణకు విత్తనాభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్నది. గతేడాది ఇటలీలో జరిగిన కాన్ఫరెన్స్లో డాక్టర్ కేశవులు ఎఫ్ఏవో డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూతో సమావేశమై తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధిని వివరించారు.
ఎఫ్ఏవో సలహా మండలి సభ్యునిగా డాక్టర్ కేశవులు ఎంపికవడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ర్టానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తనను కలిసిన డాక్టర్ కేశవులును మంత్రి సత్కరించి అభినందించారు.