హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోవారం పాటు పొడిగిస్తూ ఆదేశాలు వెలువరించింది. పెళ్లిళ్లకు వంద మంది మించి హాజరుకారాదంది. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, మత, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్కులు తప్పనిసరి అని పేర్కొంది.