చర్లపల్లి, జూన్ 8: అణు ఇంధన రంగంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఎన్ఎఫ్సీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. డీఏఈ కాలనీలోని అణు క్రీడా ఉద్యాన్లో ఏర్పాటు చేసిన జిమ్, వాకింగ్ ట్రాక్తోపాటు కాలనీలో అభివృద్ధి చేసిన ప్రాణవాయు ఉద్యాన్ను మంగళవారం ఎన్ఎఫ్సీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఎన్ఎఫ్సీలో అణు ఇంధన పరికరాలతోపాటు దేశ రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామన్నారు. అనంతరం ఎన్ఎఫ్సీ ఉత్పత్తులు, 2020-21 సంవత్సరంలో సాధించిన వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.