హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ప్లాస్మా మెల్టింగ్ ఫర్నేస్ను ఎన్ఎఫ్సీ చైర్మన్ డాక్టర్ దినేశ్ శ్రీవాస్తవ బుధవారం ప్రారంభించారు. పరిశ్రమలకు అవసరమైన రియాక్టివ్, రిఫ్రాక్టరీ మెటల్స్ను ప్రాసెస్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతమున్న ప్లాస్మా మెల్టింగ్ ఫర్నేస్ను 1980లో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని, రోజురోజుకూ పెరుగుతున్న అవసరాల అధిగమించేందుకు రూ.10 కోట్లు వెచ్చించి పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాస్మా మెల్టింగ్ ఫర్నేస్ను తయారు చేశామని వివరించారు. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అణు ఇంధనంతోపాటు ఇతర పరికరాల ఉత్పత్తి కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్ఎఫ్సీ తన కృషిని కొనసాగిస్తుందని డాక్టర్ దినేశ్ శ్రీవాస్తవ తెలిపారు.