హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 715 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 784 మంది చికిత్సకు కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,35,320కి పెరిగింది. ఇవాళ్టి వరకు 6,21,541 మంది కోలుకున్నారు. మరో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3751కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,13,069 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.