హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో 767 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 6.39 లక్షలకు పెరిగాయి. ఇవాళ్టి వరకు 6.25 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇంకా 9,729 పైగా యాక్టివ్ కేసులున్నాయి. 3775 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,20,530 మందికి కరోనా పరీక్షలు చేశారు