హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ స్వల్పంగా పెరిగింది. కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 647 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,46,606కు పెరిగాయి. ఇవాళ్టి వరకు 6,34,018 మంది కోలుకున్నారు. మరో 8,777 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,811కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,08,921 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 98.5కు కరోనా రికవరీ రేటు 98.5 పెరిగినట్లు స్పష్టం చేసింది.