హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 731 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,36,627కు పెరిగాయి. 6,23,044 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 9,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,759కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 90 వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది