హైదరాబాద్ : తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 5,74,026కు చేరాయి. 5,33,862 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 36,917 ఉన్నాయి. మొత్తం 3247 మంది మృతి చెందారు. ఇవాళ 1,00,677 శ్యాంపిళ్ల పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.