పటియాలా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇండియన్ గ్రాండ్ప్రిలో భాగంగా నీరజ్ శుక్రవారం ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న రికార్డును (88.06 మీటర్లు) తిరగ రాశాడు. కరోనా వైరస్ కారణంగా 2020లో ఒక్క టోర్నీలో కూడా పాల్గొనని నీరజ్.. గ్రాండ్ ప్రిలో ఐదో ప్రయత్నంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ‘కొవిడ్-19 కారణంగా గతేడాది పోటీలకు దూరమయ్యా. ప్రాక్టీస్కు కూడా ఇబ్బంది కలిగింది. అయినా ఒలింపిక్ పతకం పట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా’ అని నీరజ్ అన్నాడు.