పదోన్నతులు జనవరిలోగా పూర్తి చేయాలి : సీఎస్

హైదరాబాద్ : బీఆకేఆర్ భవన్లో శనివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పాల్గొని.. ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా మరింత ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో ఒక టీం వర్క్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. సచివాలయం, హెచ్ఓడీలు, జిల్లాల్లోని అన్ని కేడర్లలో పదోన్నతులను జనవరిలోగా పూర్తి చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. పదోన్నతుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
తాజావార్తలు
- విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
- 'హైదరాబాద్ నెక్లెస్రోడ్ను తలదన్నేలా సిద్దిపేట నెక్లెస్రోడ్'
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య