హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆన్లైన్లో జరిగిన ఓటింగ్లో అధ్యక్షుడిగా పొన్నం అశోక్గౌడ్, ఉపాధ్యక్షుడిగా మొహమ్మద్ ముంతాజ్పాషా, కార్యదర్శులుగా చెంగల్వ కళ్యాణ్రావు, తోటకూర సృజన్కుమార్రెడ్డి, కోశాధికారిగా కే లక్ష్మయ్య, జాయింట్ సెక్రటరీగా డీ ధనలక్ష్మి ఎన్నికయ్యారు. క్రీడలు, సాంసతిక విభాగ కార్యదర్శిగా మంగులాల్ రమావత్, 15 ఏండ్ల ఈసీ మెంబర్గా బండారి శంకర్, మహిళా విభాగం ఈసీ మెంబర్గా కట్టా శ్రావ్య, నాలుగు ఏండ్ల ఈసీ (జనరల్) మెంబర్లుగా సీహెచ్ జయకృష్ణ, లంక మురళీకృష్ణ, ఆర్పీరాజు, ఏ విశాల ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.