హైదరాబాద్లో రూ.98.48
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.101.14కు పెరిగింది. నిజామాబాద్లో రూ.100.75కు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్తో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. అయినా పెట్రో ధరల్లో పెరుగుదల మాత్రం ఆగడం లేదు. చమురు కంపెనీలు సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. సోమవారం లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరిగింది. మే 4వ తేదీ నుంచి చూస్తే పెట్రోల్ ధరలు పెరగడం ఇది 21వసారి. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.39, డీజిల్ ధర రూ.99.24 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.31, డీజిల్ ధర రూ.86.22కు చేరింది. ఇక తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ అతితక్కువగా లీటర్కు రూ.98.48 ఉన్నది. డీజిల్ ధరలను చూస్తే ఆదిలాబాద్లో లీటర్ డీజిల్కు రూ.95.93 ధర ఉండగా, నల్లగొండలో అతి తక్కువగా రూ.93.96 ఉంది.