కురవి, మార్చి 19 : పదిరోజుల క్రితం అంకురార్పణతో మొదలైన కల్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగిన పుష్పోత్సవం(పవళింపుసేవ)తో ముగిశాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పు ష్పోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ వేదపండితులు, అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తు లు, చండీశ్వరుడిని నిలిపి ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న ఆధ్వర్యంలో వేదపండితులు శివకిరణ్, శ్రీకర్, అనిల్, విజయ్, పుణ్యమూర్తి గణపతి పూజ, పుణ్యాహవచనం, ఫలప్రదానం, చతుర్వేద స్వస్తి పూజాధికాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మహామండపంలో శయనమందిరాన్ని ఏర్పాటు చేసి పుష్పోత్సవం కోసం ఊయల ఏర్పా టు చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఊయల్లో ఏకాంత సేవ కల్పించి, కల్యాణ బ్రహోత్సవాలకు ముగింపు పలికారు. మహిళాభక్తులు భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవంలో పాల్గొనగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బదావత్ రామునాయక్ దంపతులు, ఆలయ ఈవో సత్యనారాయణ దం పతులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాజునాయక్ దంపతులు, శ్రీనివాస్, సత్యసాయి భజన మందిరం నిర్వాహకురాలు గండెపల్లి లక్ష్మి, సత్యప్రియ, తరుణ్, సమ్మయ్య, రవీంద్రాచారి, రాజశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.