4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలన
అధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక అందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశించింది. సోమవారం ఈ కమిటీ బీఆర్కే భవన్లో సమావేశమై.. కొత్త రేషన్కార్డుల జారీ, రేషన్ డీలర్ల కమీషన్ పెంపు, రేషన్ డీలర్ల భర్తీ, కొత్త రేషన్ షాపులకు అనుమతి, ప్రస్తుతం ఉన్న రేషన్కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చడం, స్మార్ట్ రేషన్కార్డుల జారీపై సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో మరోసారి సమావేశమైన తర్వాత సీఎం కేసీఆర్కు పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని కమిటీకి అధ్యక్షత వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ హాజరయ్యారు.