లింగోజిగూడ డివిజన్లో చేపట్టిన బాక్స్టైప్ డ్రైన్ పనులు 70శాతం పూర్తయ్యాయని, త్వరలో ముంపునకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని తపోవన్ కాలనీ, భాగ్యనగర్, కాకతీయ,డాక్టర్స్ కాలనీ, సౌభాగ్యనగర్, సాయిరాంనగర్, లింగోజిగూడ ఓల్డ్ విలేజ్లో రూ. కోటి ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులను శనివారం స్థానిక మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామని అన్నారు. బాక్స్టైప్ డ్రైన్ పనులు పూర్తి అయితే ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం కానుందని వెల్లడించారు. లింగోజిగూడ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
వనస్థలిపురం, ఏప్రిల్ 10 : సాగర్ కాంప్లెక్స్ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిసి విన్నవించారు. డ్రైనేజీ ఔట్లెట్, నూతన లైన్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. కాలనీలోని బస్తీ దవాఖానకు కృష్ణావాటర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, పార్కులో జిమ్ను నిర్మించాలని కోరారు. నేర నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని కోరారు. ప్రాధాన్యతాక్రమంలో పను లు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జీ మహేందర్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.