మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఇకపై వెంటనే వస్తాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఇందుకోసం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆటొమేటిక్ న్యూక్లియర్ ఎస్ట్రాక్షన్ మిషన్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. గతంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే ఫలితాలు వచ్చేందుకు ఆరు గంటల సమయం పట్టేదని.. కొత్త యంత్రం ద్వారా రెండున్నర గంటల్లోపే ఫలితాలు వస్తాయని శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. దీనిద్వారా తక్షణమే కరోనా చికిత్స ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.