న్యూఢిల్లీ, జూలై 13: సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి నియమితులయ్యారు. తొలిసారి ఓ మహిళ చేతికి ఈ బాధ్యతల్ని సిస్కో అప్పగించడం గమనార్హం. సార్క్ కార్యకలాపాల అధిపతిగానూ డైసీ వ్యవహరిస్తారని మంగళవారం సంస్థ తెలియజేసింది. ఆగస్టు 1 నుంచి డైసీ ఈ కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. 17 ఏండ్లుగా సిస్కోలోనే డైసీ పనిచేస్తున్నారు.