హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి, శ్వాసకోశ సామర్థాన్ని, శరీరంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచుకొనేందుకు మూడు రకాల యోగాభ్యాసాలు (సాష్టాంగ, మకరాసన, సింహక్రియ ఆసనాలు) ఉన్నాయని పేర్కొంటూ, వాటి వీడియోలను విడుదల చేశారు.