షాద్నగర్, మే10 : కరోనా బాధితులను ఆదుకునేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అండగా నిలిచారు. తనవంతుగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు చేయూతను అందిస్తున్నారు. దాతలు, నాయకులు, పోలీసుల సహకారంతో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు శ్రీకారంచుట్టారు. ఇందులో భాగంగానే సోమవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఏసీపీ కుషల్కర్, టీఆర్ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణయాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రారంభించారు. పట్టణానికి చెందిన నరేందర్కు అత్యవసర నిమిత్తం మినీ ఆక్సిజన్ సిలిండర్ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సర్కారు దవాఖానకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
షాద్నగర్ సర్కారు దవాఖానలో మరిన్ని వసతుల కల్పనకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రూ.లక్ష నగదను విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తనయుడు మురళీకృష్ణయాదవ్ దవాఖాన ప్రధాన వైద్యుడు శ్రీనివాస్కు అందజేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ రూ.50 వేలు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కిషోర్ రూ.21 వేలు విరాళంగా అందజేశారు.
సీటీ స్కాన్ ధరలను నియంత్రించేందుకు చర్యలు..
షాద్నగర్ పట్టణంలోని డయగ్నోస్టిక్ కేంద్రాల నిర్వాహకులు సీటీ స్కాన్కు భారీగా డబ్బులు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. సీటీ స్కాన్ నిర్వాహకులు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకోవడం తగదన్నారు. ధరలను నియంత్రించేందుకు కృషిచేస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా నిర్ధారణ పరీక్షల ధరలు ఉండాలని కోరారు.