పోకిరీలు మారట్లే.. కరోనా పరేషాన్.. లాక్డౌన్ సమయంలో ఎవరూ ఏం చేయలేరన్న ధీమాలో అతివలపై ఈవ్టీజింగ్లకు పాల్పడుతున్నారు. ఇంకొందరు టైంపాస్ కోసమని ఫోన్లు చేసి.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మరికొందరు వాకింగ్ చేస్తున్న వారిని టీజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తుండటంతో ఉదయం ఆరు గంటల నుంచే షీ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. ఆవారగాళ్ల భరతం పడుతున్నాయి. ఏ సెంటర్ అయినా.. ఏ ప్రాంతమైనా.. ఏ సమయమైనా.. మీ కోసం మేమున్నాం..నిర్భయంగా ఫిర్యాదు చేయండని మహిళలకు భరోసా నిస్తున్నాయి. వీడియో కాల్స్తో విచారణ..జూమ్ మీటింగ్లతో ఈవ్టీజర్లకు కౌన్సెలింగ్ ఇస్తూ.. తగిన రీతిలో బుద్ధి చెబుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభమైన మే 12 నుంచి 27 మధ్య షీ టీమ్స్కు వచ్చిన ఫిర్యాదుల్లో 82 కేసులు పరిష్కరించారు.
నెక్లెస్ రోడ్డు..ఉదయం 6 గంటల సమయం.. మహిళలు, యువతులు వాకింగ్ చేస్తుండగా..కొందరు బైక్ రేసింగ్లు చేస్తూ.. ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం వేళ.. మమ్మల్ని అడిగేవారు లేరనుకొని..రెచ్చిపోయారు. లాక్డౌన్..కరోనా టైంలో ఎవరూ రారన్న ధీమాలో వెకిలి చేష్టలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్ బృందాలు ఉదయం ఆరు గంటలకే రంగంలోకి దిగాయి. 38 మంది బైక్ రేసర్లను పట్టుకున్నాయి. వాహనాలను స్వాధీనం చేసుకొన్నాయి. కొన్నింటిపై భారీగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో కట్టించాయి.
లాక్డౌన్, కరోనా సమయంలో మీ కోసం మేం నిరంతరం పనిచేస్తున్నాం. వేధింపులకు గురైతే షీ టీమ్స్ను ఆశ్రయించండి. డయల్ 100, వాట్సాప్ సోషల్మీడియా ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయండి. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలోనూ ఈవ్టీజింగ్ జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటున్నాం. మహిళల కోసం మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాం. శిఖా గోయెల్, షీ టీమ్స్ ఇన్చార్జి, అదనపు డీజీ
లాక్డౌన్లో ఆపద వచ్చిందా?… ఎవరైనా వేధిస్తున్నారా?.. టీవ్టీజింగ్కు
పాల్పడుతున్నారా?.. ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా?.. ఇక మీరు
భయపడకండి.. మీకు మేము అండగా ఉన్నాం.. అంటూ ‘షీ టీమ్స్’ బాధిత మహిళలకు భరోసా ఇస్తుంది. వేధింపులపై అధైర్యపడకుండా.. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయండి అని సూచిస్తున్నారు. షీటీమ్స్ ఇచ్చిన ధైర్యంతో చాలా మంది బాధిత మహిళలు, యువతులు వేధిస్తున్నారంటూ ఫోన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి.. వీడియో కాల్స్లోనే విచారణ జరిపి.. ఆయా కేసుల్లో పరిష్కారం చూపుతున్నారు. అలాగే వాకింగ్ చేస్తుంటే వెంటపడి వేధిస్తున్నారని ఫిర్యాదులు కూడా అందుతుండటంతో షీటీమ్స్ బృందాలు ఉదయం ఆరు గంటలకే రంగంలోకి దిగి.. పోకిరీలను పట్టుకుంటున్నారు. ఇలా.. ఫిర్యాదులు అందిన వెంటనే పోకిరీల భరతం పడుతూ.. బాధితులకు మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నారు.
నెక్లెస్ రోడ్డులో చాలా మంది ఉదయం 6 గంటలకు వాకింగ్ చేస్తుంటారు. అందులో మహిళలు, యువతులతో పాటు పురుషులు ఉంటారు. వాకింగ్ చేస్తున్న వారిని వెనుకనుంచి ఈవ్టీజింగ్ చేయడం, వేగంగా బైక్లు నడుపుతూ అక్కడున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై కొందరు బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. వెంటనే షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర నేతృత్వంలోని బృందాలు ఉదయం ఆరు గంటలకే రంగంలోకి దిగి.. 38 మంది బైక్ రేసర్స్ను పట్టుకున్నాయి. వాటి పత్రాలను పరిశీలించగా ఒక్కో బైక్పై ఈ చాలన్ రూ. 10 వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆయా బైక్లను స్వాధీనం చేసుకుని.. పెండింగ్ చాలన్లను కట్టించారు. దీంతో షీ టీమ్స్కు ప్రశంసలు కురిపిస్తూ వాకర్స్ ఫోన్లు చేశారు.
కరోనా, లాక్డౌన్కు ముందు బస్సులు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవి. లాక్డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో కౌన్సెలింగ్ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఉదయం వేళల్లో కూరగాయల మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘాను పెట్టి అక్కడ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సమయం అయినా కూడా రద్దీ ప్రాంతాల్లో కొందరు ఈవ్టీజర్లు మహిళలను వేధించే ఘటనలు పోలీసుల దృష్టికి రావడంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు టెలీ కమ్యూనికేషన్పై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. జూమ్ మీటింగ్లతో అవగాహన, కౌన్సెలింగ్లు నిర్వహిస్తున్నారు.
కరోనా, లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇండ్లలోనే ఉంటున్నారు. ఇండ్లలో ఉన్నవారు టైమ్ పాస్ కోసం ఎవరికి పడితే వాళ్లకు ఫోన్లు చేసేవారు కూడా ఉన్నారు. కొందరు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో షీ టీమ్స్కు ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో పాటు మాజీ ప్రేమికులు, వైవాహిక జీవితంలో విబేధాలున్న వారి భర్తలు గుర్తుతెలియని నంబర్లతో ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితులు షీటీమ్స్ను ఆశ్రయిస్తుండటంతో.. వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వేధింపులు చేసేవారు తమకు కరోనా ఉందంటే.. పోలీసులు రారు అనే ధీమాలో ఉన్నారు. వేధింపులకు గురిచేసేవారు పెండ్లి సంబంధాలు, పెండ్లిళ్లను సైతం చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మార్ఫింగ్ ఫొటోలతో సోషల్మీడియాలో బాధితులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు పెట్టి వేధింపులకు గురిచేస్తుంటారు. బాధితుల ఫిర్యాదుతో షీటీమ్స్ కరోనా నేపథ్యంలో నిందితులకు వాట్సాప్ కాల్చేసి మాట్లాడుతున్నారు. నిందితులు చేసిన తప్పును నిర్ధారించుకుంటున్నారు. వీడియో కాల్స్లోనే నిందితులతో మాట్లాడి, హామీ పత్రాలు రాయించుకుంటున్నారు. ఇలా… మే 12 నుంచి 27 వరకు షీ టీమ్స్కు వచ్చిన ఫిర్యాదుల్లో 82 కేసులను పరిష్కరించారు.
లాక్డౌన్, కరోనా సమయంలో మీ కోసం మేం నిరంతరం పనిచేస్తున్నాం. వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించండి. డయల్ 100, వాట్సాప్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మాకు ఫిర్యాదు చేయండి. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలోనూ ఈవ్టీజింగ్పై ఫిర్యాదులు రావడంతో వెంటనే షీ టీమ్స్ చర్యలు తీసుకుంటున్నది. టెక్నాలజీతో అవగాహన కార్యక్రమాలు, కేసుల దర్యాప్తులను నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మేమున్నామనే పూర్తి భరోసాను కల్పిస్తున్నాం. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదనే విషయాన్ని ప్రతి మహిళ గుర్తించి, నిర్భయంగా వేధింపులపై షీ టీమ్కు ఫిర్యాదు చేయండి.- శిఖా గోయెల్, అదనపు డీజీ, షీ టీమ్స్ ఇన్చార్జి