నాగర్కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం లో జాతీయ రహదారి వెంట కొట్ర గేట్ నుంచి రాగాయిపల్లి వరకు హరితహారం మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు కొట్ర గేటు, వెల్దండ వద్ద జాతీయ రహదారిపై కలెక్టర్ వచ్చి మొక్కలు నాటుతారని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
అయితే అక్కడికి వచ్చిన కలెక్టర్ మొక్కల పెంపకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను మొక్కలు నాటను అంటూ వెనుతిరిగి పోయాడు. కొట్ర, వెల్దండలో మొక్క లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొట్ర, వెల్దండ సర్పంచ్లకు నోటీసులు జారీ చేయాలని డీపీవోను కలెక్టర్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన