స్థానిక ప్రజాప్రతినిధులు
చేనేత వస్త్ర తయారీ పరిశ్రమ పరిశీలన
దోమకొండ, మే 8 : దోమకొండలో చేనేత వస్త్ర తయారీని ప్రోత్సహిస్తున్న గడీకోట వారసులు కామినేని అనిల్-శోభన సేవలు మరువలేనివని జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఐరేని నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో గడీకోట ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర తయారీ పరిశ్రమ కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత వస్త్ర తయారీ కేంద్రం ఏర్పాటుతో చేనేత, బీడీ కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.