బుడాపెస్ట్: భారత జూడో క్రీడాకారిణి సుశీలా దేవి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రపంచ జూడో చాంపియన్షిప్ 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సుశీల ప్రస్తుతం 989 పాయింట్లతో ఉంది. ఆసియా నుంచి ఏడో స్థానం దక్కించుకున్న సుశీల సాంకేతికంగా విశ్వక్రీడలకు అర్హత సాధించినా.. ఈనెల 28న అధికారిక ప్రకటన విడుదల కానుంది.