ధన్వాడ, మే 12 : మండల కొనుగోలు కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. బుధవారం పెద్ద ఎత్తున వరి లోడ్ వాహనాలు రావడంతో దారి పొడవునా వాహనాలతో నిండిపోయింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకొచ్చారు. గన్నీ బ్యాగుల కొరత ఉండడంతో రైతులు ధాన్యాన్ని నిన్నటి వరకు పొలాల వద్దనే ఉంచుకున్నారు. సోమవారం రెండు లారీల నుంచి గన్నీ బ్యా గులు రావడంతో ధాన్యాన్ని నింపుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. దీంతో ధాన్యం వాహనాలతో రహదారి నిండిపోయింది. కిష్టాపూర్లో మార్కె ట్ గోదాము వద్ద వడ్ల తూకం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కోసం వా హనాలు క్యూలో ఉన్నప్పటికీ చాలా మంది రైతులకు ఇంకా బ్యాగుల కొరత ఉండడంతో ధాన్యం కల్లాల వద్దనే ఉంచుకున్నారు. మండలంలోని కిష్టాపూర్, రాంకిష్టయ్యపల్లి, గున్ముక్ల, మందిపల్లి గ్రామాలకు గన్నీ బ్యాగులను పూర్తి స్థాయి లో అందలేదని, ఇంకా లక్ష అవసరమని చైర్మన్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు లక్ష బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.