హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ఆర్)గా నామకరణం చేస్తూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.తాజాగా నెక్లెస్ రోడ్ పేరు ‘పీవీ నర్సింహారావు మార్గ్’గా అధికారులు మార్చారు. ఇటీవల మంత్రివర్గం నిర్ణయం మేరకు అధికారులు పీవీ నరసింహారావు మార్గ్ బోర్డులు ఏర్పాటు చేశారు.