మొక్కు చెల్లించుకున్న నాయీబ్రాహ్మణ సంఘం నేత
ఉచిత విద్యుత్తు అందిస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు
యాదాద్రి, సెప్టెంబర్ 7: నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపేందుకు నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ మంగళవారం యాదాద్రికి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వైకుంఠద్వారం వద్ద 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సెలూన్లు, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించేందుకు వీలుగా రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.198 కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలదాస్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి దుబాయి నర్సింగ్, మీడియా సెల్ కన్వీనర్ పయ్యావుల సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.