1921లో ఆనాటి బ్రిటిష్ పాలకులు నిర్మించిన పోలీస్ అవుట్ పోస్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచన మేరకు ఎస్సై తిరుపాజీ ప్రత్యేక దృష్టి సారించి.. మండల ప్రజల సహకారంతో మదనాపురం రైల్వేస్టేషన్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ అవుట్ పోస్టుకు అన్ని హంగులు కల్పించి పోలీస్స్టేషన్గా తీర్చిదిద్దారు. ఆవరణలో గార్డెన్తోపాటు చుట్టూ కంచె ఏర్పాటు చేసి రకరకాల మొక్కలు నాటారు. ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక గది, కానిస్టేబుళ్లకు రెస్ట్రూం, వంటగది ఏర్పాటు చేశారు. త్వరలో పోలీస్స్టేషన్ను ప్రారంభించనున్నారు. ఎస్పీ సూచన మేరకు మండల ప్రజల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు ఎస్సై తెలిపారు.
మదనాపురం, మే 8