కామారెడ్డి : జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..హాకీలో భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ధ్యాన్చంద్కే దక్కుతుందన్నారు.
తన ప్రతిభతో వ్యక్తిగతంగా ప్రపంచంలోనే అత్యధికంగా గోల్స్ చేసిన హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ అని ప్రశంసించాడు. అంతటి గొప్ప క్రీడాకారుని జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు మనం ఘనంగా అర్పించే నివాళి అన్నారు. మారుమూల పల్లెల్లో పుట్టి స్వయంకృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
బాన్సువాడ పట్టణంలోని క్రీడాకారుల సౌలభ్యం కోసం అన్ని వసతులతో మినీ స్టేడియం నిర్మించాం. క్రీడాకారులకు అన్ని విదాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన స్థానిక క్రీడాకారులను సభాపతి సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన