ఆసిఫాబాద్, జూలై 30: ఆసిఫాబాద్ కవుల సంఘం సభ్యుడు, సాహితీవేత్త, జాతీయ నంది అవార్డుగ్రహీత డాక్టర్ వనపర్తి తిరుపతి (60) శుక్రవారం కన్నుమూశారు. ఆసిఫాబాద్లో వైద్యుడిగా సేవలందిస్తూనే, సాహితీ సేవ లో చురుకైన పాత్రను పోషించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగిన గొప్ప కవిగా రాణించారు. ఆయన రాసిన గోడు, నా గోడు, సాహితీ భారతం పుస్తకాలు సాహితీ ప్రపంచానికి తలమానికంగా నిలుస్తాయి. సామాజిక సేవలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాన్య జనానికి దగ్గరయ్యారు. ఆయన మరణం పట్ల సాహితీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.