న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) స్టూడెంట్ యూనియన్ చీఫ్ అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సీపీఐ(ఎం) పార్టీ తరపున ఆమె జామురియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. గతేడాది జనవరిలో జేఎన్యూలో చోటు చేసుకున్న ఘర్షణల్లో అయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన దుండగులు.. కొంతమంది విద్యార్థి నాయకులను, టీచర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన విషయం తెలిసిందే. పదునైన ఆయుధాలు, ఇనుప రాడ్లు, గ్లాస్ బాటిల్స్తో దాడులు చేశారు.
మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు మార్చి 27న, చివరి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన నిర్వహించనున్నారు.