హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) కు జాతీయస్థాయి అవార్డు దక్కింది. ప్రైవేట్ స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ (పసవా) ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బెస్ట్ సపోర్టింగ్ స్టేట్, స్కూల్ లీడర్ ఐకా న్ అవార్డు అందుకున్నది. ట్రస్మా చీఫ్ అడ్వయిజర్ కడారి అనంతరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్రెడ్డి, కోశాధికారి అరుకాల రామచంద్రారెడ్డి, రామే ధి రాంరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.
అధ్యాపకుల సమస్యలు తీర్చండి
యూనివర్సిటీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం (యూసీటీఏ టీఎస్) నేతలు కోరారు. ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన సందర్భంగా గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి కమలాకర్, నాయకులు రామలింగం, మారం తిరుపతిరెడ్డి, విశ్వనాథ్, పర్వతాలు, వినోద్, చంద్రశేఖర్రెడ్డి, సత్యనారాయణ, టీ కురుమూర్తి, వెంకటేశం, యాదయ్య, సత్యం, రత్నశేఖర్ పీ కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు