హైదరాబాద్: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకర్గ అభివృద్ధి, చేపట్టవలసిన పనులు, పూర్తిచేయాల్సిన పనుల గురించి చర్చించారు. నర్సంపేట పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, కొత్త పనులను మంజూరు చేయడంతోపాటు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. ఈమేరకు మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందించారు.
నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా నర్సంపేట నుంచి వరంగల్ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మించాలని, తద్వారా నర్సంపేటకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. మాదన్నపేట మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తికి మరో రూ.5 కోట్లు, నర్సంపేట మోడల్ సిటీ ప్లాన్లో భాగంగా 100 శాతం రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.