నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామ రైతుల సాగు పద్ధతులు అనుసరణీయమని మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు ప్రశంసించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని వారు బుధవారం సందర్శించారు. నాందేడ్లోని నందిగ్రామ్ ఆగ్రో చైర్మన్ నరేంద్ర చవాన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన రైతులు.. అంకాపూర్ రైతులతో మాట్లాడి సాగు విధానాలను తెలుసుకున్నారు.
అనంతరం రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో సమావేశమయ్యారు. పసుపులో నూతన వంగడాలు, సాగు పద్ధతులను ఆయన వారికి వివరించారు. పసుపులో నూతన వంగడాలను రైతులకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో అంకాపూర్ను సందర్శించినట్లు నందిగ్రామ్ ఆగ్రో చైర్మన్ నరేంద్ర చవాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : అది పులి కాదు..పునుగు పిల్లి
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు