సిద్దిపేట : రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
తొలిరోజు సిద్దిపేట మున్సిపాలిటీకి 12 మంది అభ్యర్థులు 15, అచ్చంపేట మున్సిపాలిటీకి 4 నామినేషన్లు ( టీఆర్ఎస్ నుంచి 3 , కాంగ్రెస్ నుంచి ఒక) నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు 15 నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది.
ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి