హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ పదో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బంజారాహిల్స్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. పత్రిక స్థాపించి పదేండ్లు పూర్తిచేసుకొన్న సందర్భంగా సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవి, సీజీఎం సీహెచ్ శ్రీనివాస్, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో ఓరుగంటి సతీశ్, న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు, స్టేట్ బ్యూరో చీఫ్ ఎక్కలదేవి శ్రీనివాస్, సెంట్రల్ డెస్క్ ఇన్చార్జి జగన్మోహన్, సర్క్యులేషన్ డీజీఎంలు రాంరెడ్డి, రమేశ్, అడ్వైర్టెజ్మెంట్ డీజీఎం ప్రవీణ్, హెచ్ఆర్ మేనేజర్ మధుసూదన్, సర్క్యులేషన్ మేనేజర్ సంజీవ్, హైదరాబాద్ ఎడిషన్ ఇన్చార్జి చిరంజీవి, హైదరాబాద్ సిటీబ్యూరో చీఫ్ గుండాల కృష్ణ, సినిమా డెస్క్ ఇన్చార్జి మధు, చీఫ్ ఆర్టిస్టు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.