నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 8718 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8831 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28095 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 80594 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.60 అడుగులు (213.4011 టీఎం సీలు) ఉంది. శ్రీశైలంకు 33629 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది.