నందికొండ: ఇటీవల సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రను అత్యాచారం చేసి చంపేసిన ఘటన పాఠకులకు విధితమే. కాగా చిన్నారి చైత్ర తల్లిదండ్రులు రాజు, జ్యోతి, పలువురు బంధువులు సోమవారం నాగార్జునసాగర్లోని శివాలయం పుష్కర్ఘాట్లో పూజా కార్యక్రమాలు నిర్వహంచి చిన్నారి చైత్ర అస్థికలను కృష్ణా నదిలో కలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడు రాజు మరణంపైన మాకు సంతృప్తి లేదని, మాకు అప్పగించినా, మా ముందు చంపినా మా లాంటి తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి చేకూరేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.