మూగబోయిన మైకులు.. అందరి దృష్టి పోలింగ్పైనే
నెల రోజులకుపైగా హోరెత్తిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం సరిగ్గా ఏడు గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులంతా 17న జరిగే పోలింగ్పై దృష్టి సారిస్తున్నారు. ప్రచారం ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వాడివేడీగా నిర్వహించాయి. టీఆర్ఎస్ అందరికంటే ముందు క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరునూ కలిసింది. సాగర్ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు ప్రచార అస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్లింది.