జెనీవా : భారతదేశంలో పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ ఎంత తీవ్రంగా ఉంటుందో సెకండ్ వేవ్ గుర్తుచేస్తున్నదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధోనం ఘెబ్రేయెస్ అన్నారు. జెనీవాలో జరిగిన వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా ఆక్సిజన్ కొరత, దవాఖానల్లో బెడ్స్ కొరత, రెమ్డెసివిర్ వంటి ప్రధాన అత్యవసర ఔషధాల కొరత కారణంగా భారత్లో ప్రతి రోజు గడిచేకొద్దీ పరిస్థితి చేతులెత్తేస్తున్నట్లు కనిపిస్తోంది అని ఘెబ్రేస్ తెలపారు.
25 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతున్నదని ట్రెడోస్ చెప్పారు. కరోనా యొక్క కొత్త వేరియంట్ మరింత వ్యాప్తి చెందే ఫలితం కావచ్చునన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరింత వేగంగా టీకాలు వేయడం అవసరమని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో ఇన్ఫెక్షన్ మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, అనేక దేశాల్లో ఉన్న భారతీయ మిషన్లు అక్కడ ప్రభుత్వాలు, సంస్థలతో ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్తోపాటు ఇతర ఔషధాల కోసం చర్చలు జరుపుతున్నాయి. యూఏఈ, సింగపూర్, మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా కూడా ఆక్సిజన్ సరఫరాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది.
భారతదేశంలో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఈయూ, బ్రిటన్, అమెరికా దేశాలు సరఫరా చేయడంలేదు. ముడి పదార్థాలు సరఫరా చేయడంపై మౌనందాల్చిన అమెరికా.. తమ దేశ పౌరుల ఆరోగ్య భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేయడం గమనార్హం.
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..