జయశంకర్ భూపాలపల్లి : కరోనా కష్ట కాలంలో ప్రజలు మనోధైర్యం కోల్పోకుండా జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. రేగొండ మండలానికి చెందిన కందుకూరి శంకరా చారి కరోనాతో మృతి చెందగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్లి కరోనా పరీక్ష చేసుకోవాలన్నారు. డాక్టర్ల సలహా, సూచనలు తీసుకుని ధైర్యంగా ఉండాలన్నారు.
శంకరా చారి కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి