నమస్తేతెలంగాణ నెట్వర్క్ : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతోంది. మండలంలోని గొర్లవీడులో మంగళవారం జరిగిన సర్వేలో డీపీవో ఆశాలత పాల్గొని పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి కల్పన, కారోబార్ రాజవీరు పాల్గొన్నారు. అలాగే, భూపాలపల్లి 22వ వార్డులోని లక్ష్మీనగర్, హనుమాన్నగర్, గణేశ్ చౌక్, మెయిన్ రోడ్డులో కౌన్సిలర్ ముం జాల రవీందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేను మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ, ఆర్పీ రాజ కుమారి, టీఆర్ఎస్నాయకులు ఓరుగంటి లక్ష్మి, రవి పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఎంపీడీవో రవీంద్రనాథ్, ఎంపీవో శంకర్రావు, ఏఎన్ఎం సుమలత పాల్గొన్నారు. టేకుమట్ల మండలంలోని సుబ్బక్కపల్లిలో చేపట్టిన సర్వేలో మండల స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం, ఎంపీడీవో చండీరాణి, తహసీల్దార్ రవీందర్, డాక్టర్ రవి, సంపత్, పండారి బాయి, శ్రావణ్ పాల్గొన్నారు. కాటారం మండల కేంద్రంతో పాటు మేడిపల్లి, కొత్తపల్లి, అంకుషాపూర్, బయ్యారం, దేవరాంపల్లి గ్రామాల్లో ఫీవర్ సర్వేను ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ సునీత, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డితో కలిసి జిల్లా ఉద్యాన అధికారి, మండల ప్రత్యేక అధికారి అక్బర్ పరిశీలించారు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల పరిధిలో జరిగిన సర్వేను ఎంపీడీవో నర్సింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్ పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, ఏఎన్ఎం సాధన పాల్గొన్నారు. గణపురం మండలంలోని చెల్పూర్, బస్వరాజుపల్లిలో సర్వేను చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సర్వేను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సుధీర్కుమార్, తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఎంపీవో ఉపేందరయ్య పరిశీలించారు. పలిమెల మండల కేంద్రంతో పాటు లెంకలగడ్డ, పంకెన తదితర గ్రామాల్లో జరుగుతున్న సర్వేను తహసీల్దార్ సాయిబాబు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ సాభాగ్యవతి, ఏఎన్ఎం శ్రీలత, పంచాయతీ కార్యదర్శులు మధుకర్రెడ్డి, వరలక్ష్మి, శ్రీధర్ పాల్గొన్నారు. ములుగు కాసిందేవిపేటలో సర్పంచ్ అహ్మద్పాష ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సమ్మక్క, ఆశవర్కర్లు వజ్ర, అంగన్వాడీ టీచర్ సరస్వతి, రజియాబేగం, శోభ పాల్గొన్నారు. వాజేడు మండలం నాగారంలోని ఐటీఐ కళాశాల సమీపంలోని డబుల్బెడ్రూం ఇండ్లలో హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కుందమల్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.