మెదక్రూరల్ మే, 25 : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత జ్వర సర్వే నిర్వహిస్తున్నామని ఏఎన్ఎం అవీలా అన్నారు. మంగళవారం మెదక్ మండలంలోని సంగాయిగుడ తండాలో, తదితర గ్రామా ల్లో ఇంటింటా వైద్య, పంచాయతీ , అంగన్వాడీ సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై వివరాలు నమోదు చేశారు. గ్రామాల్లో కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి కరోనా కిట్టును అందజేస్తున్నారు.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
పెద్దశంకరంపేట, మే 25: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ అన్నారు. పెద్దశంకరంపేటలో వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి పలు వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వే నిర్వహించారు. ఎవ్వరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ దవాఖానలో టెస్టు చేయించుకొని మెరుగైన వైద్యం పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, ఈవో విఠల్, అంగన్వాడీ టీచర్ సరళ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వద్దు: ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు
నిజాంపేట,మే 25: మండలంలోని నస్కల్లో వైద్య సిబ్బం ది, అంగన్వాడీలు సంయుక్తంగా చేపట్టిన జ్వర సర్వేలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు సంతోష, రేఖ, అంగన్వాడీ కార్యకర్త మం జుల,గ్రామస్తులు పంగరాజు ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్డీవో శ్యాంప్రకాశ్
తూప్రాన్ రూరల్, మే 25 : కరోనా వైరస్ నియంత్రణ, కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో శ్యాంప్రకాశ్ ప్రజలకు సూచించారు. మండలంలోని ఇస్లాంపూర్లో జ్వర సర్వేను ఎంపీడీవో అరుంధతితో కలిసి ఆయన పరిశీలించారు. ఆరోగ్య సిబ్బ ంది ప్రజల నుంచి సేకరిస్తున్న సర్వే తీరు, నమోదు వివ రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లక్షణాలతో బాధపడుతున్న వారు దాచి పెట్టకుండా వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుకన్య, కార్యదర్శి రాజేశ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వెల్దుర్తి..
వెల్దుర్తి, మే 25. కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన ఇంటింటి సర్వే వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ముమ్మరంగా సాగుతున్నది.
మాసాయిపేటలో అంగన్వాడీ టీచర్లు, ఆశలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలు, జ్వరం, జలుబు, దగ్గు వంటి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలు సేకరించారు. జ్వరం, జలుబు, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా కరోనా కిట్ ను అందజేశారు.