వరంగల్ అర్బన్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, గులాబీ పార్టీలోనే మేమంతా కొనసాగుతూ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని గుండేడు గ్రామ ప్రజలు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని గుండేడు గ్రామస్థులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎవరెన్ని చెప్పిన ప్రజల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పార్టీ సూచనలమేరకు పనిచేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా ఈటల యువసేన నియోజకవర్గ అధ్యక్షునిగా కొనసాగుతున్న మురహరి కిరణ్ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మురహరి కిరణ్, వార్డు మెంబర్లు ఎం.డి.మహబూబి కుత్బుల్లాద్దీన్, ఎం.డి.అప్సరి బేగం అప్సర్ అలీ, గ్రామ మైనార్టీ అధ్యక్షులు ఎం.డి.ముస్తాఫా, టీఆర్ఎస్వీ గ్రామ అధ్యక్షులు ఎం.డి.హకీమ్ తదితరులు పాల్గొన్నారు.