మునుగోడు, మే 8 : నల్లగొండ జిల్లా మునుగోడు తాసిల్దార్ సీ సునంద కరోనాతో శనివారం మృతిచెందారు. గత నెల 15 నుంచి సెలవులో ఉన్న ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్గా తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 13న మునుగోడు తాసిల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సునంద కేవలం మూడు నెలల వ్యవధిలోనే విధి నిర్వహణలో మంచి పేరు సంపాదించారు. కరోనా వల్ల ఆమె అకాలంగా మృతిచెందడం దురదృష్టకరమని నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.