మునిపల్లి /సంగారెడ్డి : విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన కళ్లపల్లి రాతన్మ కుటుంబానికి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శశికుమార్ బాసటగా నిలిచారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన బాధిత కుటుంబానికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శైలేజ శివశంకర్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చెయ్యడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, ఆనంద్, నర్సింలు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.