వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్న చిత్రం శ్రీకారం. కిశోర్ బి డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంలో యువ నటుడు శర్వానంద్ హీరోగా నటిస్తుండగా..ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయిమాధవ్ బుర్రా కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్బంగా సాయిమాధవ్ బుర్రా కొన్ని విషయాలను పంచుకున్నాడు. శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి నేను డైలాగ్స్ రాశాను. చాలా రోజుల ఎదురుచూపు తర్వాత మరో అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా రైతుల గురించి చర్చిస్తున్న సమయం. వ్యవసాయం ఆవశ్యకతను తెలిపే కథ. ఈ సినిమా కోసం రాయడం నా బాధ్యతగా భావించాను. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఫీలయ్యారు. ఎంతో గొప్పనైన రైతు కొడుకు రైతు కావడం లేదనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు సాయిమాధవ్. వ్యవసాయం ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ వ్యవసాయం చేయకపోతే మనం తినడం మానేయాలంటూ చెప్పుకొచ్చాడు సాయిమాధవ్.