వరంగల్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతననిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టరేట్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం కోసం రూపొందించిన ప్లాన్లను చీప్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మంచనున్నట్లు పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నామన్నారు. ఇందుకుగాను సుమారు రూ.2కోట్లు వ్యయం చేయనున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ జైల్కు సంబంధించిన 56ఎకరాల భూమి సేకరణ పూర్తయ్యిందన్నారు. భవిష్యత్త్ తరాలను దృష్టిలో పెట్టుకొని మరికొంత భూమిని సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సెంట్రల్ జైలే కాకుండా ఎంజీఎం, కంటి ఆసుపత్రి, ఆటోనగర్, పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని భూ సేకరణ చేస్తున్నామన్నారు.
ఇందుకు అవసరమైన సమగ్ర భూ సర్వే చేపట్టి వెంటనే పూర్తి చేయాలని నకలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతను మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాందీహన్మంతు, డీఆర్వో వాసుచంద్ర, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ