ఆదిలాబాద్ : పలు అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్న ముక్రా కే గ్రామం కరోనా నియంత్రణలో ముందడుగు వేసింది. ఇచ్చోడ మండలం ముక్రా కే పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దులో కట్టెను అడ్డంగా వేసి చెక్పోస్ట్లాగా ఏర్పాటు చేశారు.
గ్రామంలోనికి ఎవరైనా వచ్చిన థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ శానిటైజ్ చేస్తున్నారు. బయటికెళ్తే వారి వివరాలను రిజిస్టర్లో రాసుకుంటున్నారు. ఇలా ప్రతి పనిని పక్కాగా చేపడుతూ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం