హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించనున్న ము క్కోటి వృక్షార్చనను విజయవంతం చేసేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గురువారం ఎంపీ సంతోష్కుమార్ను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ సందర్భంగా వారికి సంతోష్కుమార్ ముక్కోటి వృక్షార్చన పోస్టర్లను అందజేశారు.